ఈమధ్య చాలా చిత్రాలలో హీరోయిన్స్ సైతం పలు రకాల సినిమాలలో స్పెషల్ సాంగ్లలో నటిస్తూ ఉన్నారు. ఇలాంటి వారికే దర్శక, నిర్మాతలు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండడం చేత వీరి క్రేజ్ కూడా పెరుగుతోంది. పుష్ప సినిమాలో సమంత, రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే ఇలా గతంలో కూడా చాలామంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ లలో నటించారు. పుష్ప చిత్రంలో సమంత నటించిన స్పెషల్ సాంగ్ కి భారీ క్రేజీ ఏర్పడింది. ఈ పాటని విదేశాలలో పలు రకాల రీల్స్ చేయడమే కాకుండా చాలామంది ఫంక్షన్స్ కి ఈ పాటలకి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు.


ఇప్పుడు పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ కి ఎవరైతే బాగుంటుందనే విషయంపై చిత్ర బృందం ఆలోచిస్తున్న సమయంలో ఒక బాలీవుడ్ బామ్మ పేరు వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ స్పెషల్ సాంగ్ పైన చిత్ర బృందం ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదట. ఇప్పుడు పెట్టబోతోందనీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు జాన్వీ కపూర్.. గత కొంతకాలంగా ట్రై చేస్తున్న ఈమె డేట్లు అడ్జస్ట్ కాలేకపోవడంతో కాస్త లేట్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నది.


ఇప్పుడు పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ కి డేట్లను సైతం అడ్జస్ట్మెంట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మావ అనే పాటకు రచ్చకు మించి జాన్వి  చేయబోతుందనే విధంగా బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జాన్వీ దేవర సినిమాలో టూ హాట్ గా కనిపిస్తోంది. మరి ఇప్పుడు సుకుమార్ చేతిలో పడితే ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ సంపాదించుకోవడం ఖాయమని అభిమానులైతే భావిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అప్పుడే స్పెషల్ సాంగ్ లు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: