తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అతి కొద్ది మంది హీరోలలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈయన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ కు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయనకు సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

అందులో భాగంగా ఈయన ఉప్పెన మూవీ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొండపొలం అనే వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ నటుడు రంగ రంగా వైబవంగ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే ఆఖరుగా వైష్ణవ్ "ఆది కేశవ" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

ఇలా ఉప్పెన మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత వరుసగా మూడు అపజాయలను అందుకున్న ఈయన ఇప్పటి వరకు తన తదుపరి మూవీ ను ఓకే చేయలేదు. ఇక ప్రస్తుతం ఈ యువ నటుడు తన నెక్స్ట్ మూవీ ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా దర్శకుడు కృష్ణ చైతన్య తో చేయబోతున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pvt