ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఒక సాదాసీదా నటుడిగా అడుగుపెట్టిన శివ శంకర వరప్రసాద్.. ఏకంగా ఏకంగా తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా చిరంజీవిగా  పరిచయమయ్యాడు. అంతేకాదు సుప్రీం హీరోగా తెలుగు పరీక్షకులకు దగ్గరైన చిరంజీవి.. ఆ తర్వాత మెగాస్టార్ గా టాలీవుడ్ ను ఏలేసాడు. తన డాన్సులు యాక్షన్ తో ఇక ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు  దాదాపు మూడు దశాబ్దాల నుంచి అగ్ర హీరోగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు.

 అయితే ఇప్పుడు వరకు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్బస్టర్ హీట్ లు కొట్టేశాడు అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది దర్శకులతో ఇక ఎన్నో నిర్మాణ సంస్థలతో కలిసి పని చేశాడు   అయితే ఇలా ఎంతమందితో పనిచేసిన మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎవర్ గ్రీన్ మూవీస్ అంటే చాలు కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని నిర్మాణ సంస్థలతో చిరంజీవి కాంబినేషన్ అన్న కూడా అదే రేంజ్ లో క్రేజీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లలో చిరంజీవి వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ కాంబినేషన్ కూడా ఒకటీ. చిరంజీవి కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచే సినిమాలలో ఇంద్ర, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో రెండు ముందు ఉంటాయి.



 అయితే ఈ రెండు సినిమాలు కూడా అటు వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. కాగా ఈ రెండు సినిమాలకు సీక్వెల్ వస్తే బాగుండు అని అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. కాగా ఇప్పుడు మెగా అభిమానులందరికీ కూడా కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు వైజయంతి మూవీస్ నిర్మాత అయిన అశ్విని దత్. ఇంద్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలకు సీక్వెల్ తీయాలని చాలామంది అడుగుతున్నారని తప్పకుండా తీస్తాము అంటూ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇంద్ర సినిమా రీ రిలీస్ సందర్భంగా మూవీ టీం అంత ఈ విషయం గురించి చర్చించుకున్నట్లు చెప్పుకొచ్చాడు అశ్విని దత్.

మరింత సమాచారం తెలుసుకోండి: