ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలోని ఈయన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసి దేశ వ్యాప్తంగా ఈ మూవీ యొక్క ప్రమోషన్లను మొదలు పెట్టే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్టు తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం తానుంటున్న ఇల్లు మరియు ఆఫీసును మరో చోటికి మార్చాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈయన బంజారాహిల్స్ లోని వెంకటగిరి ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏరియాలో అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన బిల్డింగును తాజాగా కొనుగోలు చేసినట్లు అక్కడికే తన నివాసాన్ని మరియు తన ఆఫీసును కూడా మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కొత్త ఇంటి వైశాల్యం సుమారుగా 3500 చదరపు గడువుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిని విలాసమంతమైన సకల , సౌకర్యాలతో అధునాతన వసతులు ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇంటికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ పూర్తి అయ్యాయి అని మరికొన్ని రోజుల్లోనే అల్లు అర్జున్ కొత్త ఇంటికి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa