గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఆల్లు vs మెగా అనే వివాదం రోజురోజుకి పెద్దదవుతూనే ఉంది. మెగా కుటుంబం అంతా బాగుంటుంది అంటు బన్నీ వాసు చెప్పినప్పటికీ ఈ వివాదం మరింత పెరుగుతూనే ఉంది. ఇటీవలె అల్లు అర్జున్ ఇచ్చినటువంటి స్పీచ్ వల్ల మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. చాలామంది అల్లు అర్జున్ ను ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది. వీటికి తోడు అల్లు రామలింగయ్య గురించి అప్పట్లో రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసినటువంటి కొన్ని కామెంట్స్ వెతికి మరి మెగా అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.


పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒక సినిమా షూటింగ్లో భాగంగా అల్లు రామలింగయ్య గారు.. షూటింగ్ కి వస్తూ ఉండగానే.. పోయింది పోయింది స్టేట్ రౌడీ పోయింది అంటూ మాట్లాడుతున్నారట.. ఏంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావ్ అని ఈయన అడగగా.. పోయిందని చెబుతున్నా కదా అంటు తెలిపారట. అయితే అక్కడే ఉన్న చిరంజీవి ఇది విని తెల్లబోయారట. ఏంటి మామయ్య ఇలా అనేస్తున్నారు అనే విధంగా ఆశ్చర్యపోయారట. అయితే ఆ తర్వాత ఐదు నిమిషాలకు సారథి స్టూడియోస్ బ్యానర్ శశిభూషణ్ వచ్చి ఈ సినిమా మొదటిరోజు నుంచి ఎంతటి కలెక్షన్స్ రాబట్టిందో లెక్కలేసి మరి చిరంజీవికి చెప్పారట.



అయితే ఇదంతా విన్న చిరంజీవి గారు అల్లు రామలింగయ్య పక్క ఒకరకంగా చూశారట.వెంటనే నాకేం తెలుసు ఎవరో చెప్పారు నేను మీకు చెప్పాను అంటూ రామలింగయ్య తెలిపారుట. అయితే ఇది ఏ సందర్భంలో చెప్పారనే విషయాన్ని పక్కన పెడితే ఇంతవరకు మాత్రమే ఈ వీడియోని కట్ చేసి మెగా అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. అంతేకాకుండా అల్లు అరవింద్ రామ్ చరణ్ సినిమాలకి ప్రమోషన్ చేయకుండా అవి సక్సెస్ కాకుండా అడ్డుకుంటున్నారనే విధంగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మగధీర చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయకుండా ఆపేసారని అల్లు అరవింద్ పైన మెగా అభిమానులు పోస్ట్ పెడుతున్నారు. వీటి పైన అల్లు ఫాన్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: