ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈయన అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేశాడు. ఈ మూవీ హిందీ లో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన కు హిందీ సినీ పరిశ్రమలో కూడా సూపర్ క్రేజ్ వచ్చింది.

తాజాగా ఈ దర్శకుడు యానిమల్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే అద్భుతమైన స్థాయిలో క్రేజ్ ఉన్న ఈ దర్శకుడు వచ్చే నాలుగు సంవత్సరాలకు తన షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ చాలా రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రస్తుతం సందీప్ చేస్తున్నట్లు సమాచారం.

మూవీ ని మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేసి 2026 వ సంవత్సరం ఈ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యానిమల్ పార్క్ మూవీ ని 2028 వ సంవత్సరం విడుదల చేసే విధంగా సందీప్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం సందీప్ , అల్లు అర్జున్ తో కూడా ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. మరి ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ... ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srv