టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ కి సంబంధించిన చాలా బాదం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కాకపోతే డిసెంబర్ లో ఇప్పటికే భారీ సినిమాలు అనేకం విడుదలకు రెడీగా ఉన్నాయి.

డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కాబోతుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ కూడా విడుదల కాబోతోంది. దానితో ఈ మూవీ బృందం డిసెంబర్ నెలలో తండేల్ సినిమాను విడుదల చేయడం దాదాపుగా కష్టం గానే కనపడుతుంది. మరి కొత్తగా ఈ సినిమాకు ఏ నెలను చూసుకుంటారో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని బన్నీ వాసు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటివరకు నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఈ సినిమాలో జాతర సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాతర పాటను అత్యంత భారీ ఎత్తున చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 65 మంది కళాకారులను శ్రీకాకుళం నుండి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సాంగ్ లో 900 పైగా డాన్సర్స్ కం జూనియర్ నటులను తీసుకున్నట్లు సమాచారం. ఒక భారీ సెట్ లో భారీ ఖర్చుతో జాతర సాంగ్ ను , ఈ మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ తో నాగ చైతన్య కు ఏ స్థాయి విజయం అందుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc