మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం మొదటగా వాల్టేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఆ తరువాత భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ సినిమా భారీ అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది . ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ సోసియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతుంది. మల్లాడి వర్సెస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేయాలి అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన నైజాం , సీడెడ్ , ఏపీ థియేటర్ హక్కులకి 120 కోట్లు కోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఒక యంగ్ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ యువి క్రియేషన్స్ సంస్థ తో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు , మరో కొన్ని రోజుల్లోనే ఈ ఏరియాలకు సంబంధించిన విశ్వంభర సినిమా హక్కులు ఫైనల్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి విశ్వంభర మూవీ కి నైజాం , సీడెడ్ , ఏపీ ఏరియాలలో ఏ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: