తెలుగు సినీ పరిశ్రమలో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు . ఈయన అ! అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు . ఈ మూవీ మంచి విజయం సాధించడం ప్రేక్షకుల నుండి , విమర్శకు ల నుండి ఈ మూవీ కి మంచి ప్రశంసలు దక్కడం తో ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది . ఇకపోతే ఈ దర్శకుడు ఆఖరుగా తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా హనుమాన్ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు బాలీవుడ్ నటుడు రన్బీర్ సింగ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. దానితో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ను వెండి తెరకు పరిచయం చేయబోయే బాధ్యత లను ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు.

మరికొన్ని రోజుల్లోనే మోక్షజ్ఞ హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలయ్య కుమారుడిని వెండి తెరకు పరిచయం చేసే బాధ్యతలను తీసుకున్న ప్రశాంత్ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి డి వి వి దానయ్య కుమారుడు అయినటువంటి దాసరి కళ్యాణ్ హీరో గా ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా కొత్త హీరోలను వెండితెరకు పరిచయం చేయబోయే బాధ్యతలను వరుసగా ప్రశాంత్ వర్మ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: