టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్‌  నటిస్తున్న ప్రాంచైజీ ప్రాజెక్ట్‌ పుష్ప 2 ది రూల్‌ . సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాసిల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఇక ప్రస్తుతం  పుష్ప ది రూల్ క్లైమాక్స్‌ ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు మేకర్స్‌ స్పెషల్ సాంగ్‌ షూట్‌ చేయడానికి రెడీ అవుతుండగా.. క్లైమాక్స్‌ షూట్‌తో అగ్రభాగం షూట్‌ పూర్తి కానుందట. చివరి షెడ్యూల్‌లో స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరించనున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. క్లైమాక్స్ పూర్తయిన తర్వాత సాంగ్‌ షూట్‌పై నిర్ణయం తీసుకోబోతున్నారని ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ

 మూవీని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. రిలీజ్ అప్‌డేట్‌ పోస్టర్‌లో బన్నీ పుష్పరాజ్‌గా కత్తి పట్టుకుని ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్‌ పార్టుకు అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ విషయం కాసేపు పక్కన పెడితే  ఒక హీరోయిన్ అల్లు అర్జున్ తో నటించి చాలా పెద్ద తప్పు చేశానంటూ బాధపడిందట. బన్నీ సినిమా కారణంగా ఎన్నొ ఇబ్బందులు పడిందట.. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో అసలు మ్యాటర్

 ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఆమె టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మనుయ్యేల్.  అనూ.. బన్నీ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో సినిమా ఆక్టర్ ప్లాప్ అవ్వడానికి కారణం అను ఇమ్మనుయ్యేల్ అంటూ.. బన్నీ ఫ్యాన్స్ అంతా ఆమెను విపరీతంగా తిట్టిపోశారట. ఆమెను ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారట. దీంతో అను ఇమాన్యుల్ చాలా ఇబ్బంది పడిందని.. మానసికంగా ఎంతో బాధపడిందని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలు నటించకుండా ఉండి ఉంటే బాగుండేది.. ఈ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశానంటూ.. సన్నిహితులతో కూడా చెప్పుకొచ్చిందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: