అక్కినేని మూడో త‌రం హీరో నాగ చైత‌న్య కొన్నేళ్ల క్రితం స‌మంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వారు కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఏవో కార‌ణాల వ‌ల‌న వారిద్ద‌రు విడిపోయారు. ఇక కొన్నాళ్ల‌పాటు సింగిల్‌గా ఉన్న నాగ చైత‌న్య ఊహించని విధంగా ఆగ‌స్ట్ 8న శోభిత ధూళిపాళ్ల‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ గతంలో కథనాలుగా వెలువడ్డాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ ని శోభిత ధూళిపాళ్ల కొట్టిపారేసింది. కాని స‌డెన్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని పెద్ద షాకే ఇచ్చారు.

 అనంతరం నాగార్జున ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే అక్కినేని నాగచైతన్య చేస్తున్న లేటెస్ట్ సినిమా తండేల్. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. పైగా కార్తికేయ2 సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్‌లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సారి నాగ చైతన్యకు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు పడేలానే ఉందని అక్కినేని ఫ్యాన్స్ అందరూ

 ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీలో జాతర ఎపిసోడ్ కోసం భారీ ఖర్చుతో హైదరాబాద్ లో పెద్ద సెట్ వేశారు. ఈ జాతర కోసం 60 మంది కళాకారులని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారట. అలాగే జూనియర్ ఆర్టిస్ట్స్, డాన్సర్స్ కలిపి 900 మంది వరకు ఈ జాతర ఎపిసోడ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే రేంజ్ లో ఫోక్ బీట్ సాంగ్ కూడా ఉంటుందంట. దేవిశ్రీ ప్రసాద్ ఈ జాతర ఎపిసోడ్ కోసం గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే మ్యూజిక్ అందించారని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: