మలయాళ నటి మహాత్మా ఫేమ్ భావన కిడ్నాప్‌, ఆపై లైంగిక వేధింపులకు గురైన తర్వాత జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ మలయాళ చలనచిత్ర రంగంలో ఆడవారిపై జరిగే అకృత్యాల గురించి ఇటీవల ఒక రిపోర్టు రిలీజ్ చేసింది. అందులో కామాంధులు ఆడవారిని ఎంతగా వేధిస్తున్నారో తెలియజేయడం జరిగింది. ఇక అప్పటినుంచి ఈ విషయాన్ని సంచలనంగా మారింది ఈ క్రమంలో చాలామంది నటీమణులు తమకి కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనట్టు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నటి ముందుకొచ్చి మలయాళ నటుల వల్ల తాను నరకం అనుభవించాలని చెప్పింది. స్టార్ యాక్టర్ జయసూర్య, ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు తనను ఎంతగానో వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.

'ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్య, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ నోబల్‌, విచు వల్ల అసభ్య పదజాలంతో నన్ను ఎంతగానో హింసించారు. 2013లో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు వాళ్లు నన్ను దూషించడం జరిగింది. అయినా సరే నేను అవమానాలను భరించా. అలా భరిస్తుంటే వారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. వారి చిత్రహింసలు తట్టుకోలేక పూర్తిగా మలయాళ సినిమాని వదిలేసా. వారి కారణంగానే చెన్నైకు వెళ్లిపోవాల్సి వచ్చింది. దీని గురించి గతంలోనే స్థానిక పత్రికలతో తెలియజేయడం జరిగింది. వీరి కారణంగా నేను ఎంతో   కుంగిపోయా. న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నాను. ఆడవారిని వేధించే వీరు తగిన శిక్ష అనుభవించాలి'' అని ఆమె పోస్ట్‌ లో రాసుకొచ్చారు.

దాదాపు ఏడేళ్లుగా విచారణలో ఉన్న జస్టిస్ హేమ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాస్టింగ్ కౌచ్ నుండి వివక్ష వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఈ అంశాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విస్తృత దృష్టిని, చర్చను రేకెత్తించాయి. మాలీవుడ్‌లోని ఇద్దరు ప్రముఖ నటీమణులు మంజు వారియర్, గీతు మోహన్‌దాస్ ఈ నివేదికకు తమ మద్దతును ప్రకటించారు, ఇది పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి నిజాన్ని వెల్లడిస్తుందని పేర్కొంది. ఇలాంటి సంఘటనలను నివేదించేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని వారు నొక్కి చెప్పారు.

అయితే, ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు.  పలువురు నటీనటులు, దర్శకులు కూడా పరిశ్రమలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులతో తమ అనుభవాలను పంచుకున్నారు. దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ అనుచితంగా ప్రవర్తించారని బెంగాలీ నటి పాయల్ ఘోష్ ఆరోపిస్తూ కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరో నటి చేసిన ఆరోపణల కారణంగా నటుడు సిద్ధిఖీ కూడా 'అమ్మ' ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. నటి సోనియా మల్హార్ సినిమా షూటింగ్ సమయంలో పేరు తెలియని నటుడిపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: