నేచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్నతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అదే ఫామ్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ  దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే సరిపోదా శనివారం ఆగస్టు 29న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలెట్టేశారు. అయితే ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక ఇందులో భాగంగానే ఈగ సినిమా సీక్వెల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'నేను విజయేంద్ర ప్రసాద్‌ సర్‌ని ఎప్పుడూ 'ఈగ' సీక్వెల్‌ గురించి అడగలేదు. కానీ, రాజమౌళితో దీని గురించి సరదాగా చర్చించాను. 'ఈగ 2' చేస్తానన్నారు కదా.. ఇది ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన.. ''మేము ఈగ 2'(Eega2) చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్‌లో తిరిగి వస్తుంది'' అని చెప్పారు. 'ఈగ' సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆయనకు దీని సీక్వెల్‌ గురించి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని నేను

 అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు'' అంటూ దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. ఇక  నాని, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఈగ' బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. సుదీప్‌ విలనిజం ఎంతగానో ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ సినిమా 2 జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. అలా ప్రస్తుతం నాని ఈ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: