అలనాటి హీరోయిన్ ఇంద్రజ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇంద్రజ తల్లి పాత్రలు, వదిన వంటి పాత్రలలో మాత్రమే నటిస్తున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై పలు షోస్ లో జడ్జిగా, యాంకర్ గా కూడా ఈమె వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఇంద్రజ నటించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రమణ్యం. ఈ సినిమాలో రావు రమేష్ కథానాయకుడిగా నటించారు.


దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో రిలీజ్ అయిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఇంద్రజ చేసిన పలు వివాదాస్పద వాక్యాలు ఇప్పుడు సినీ పరిశ్రమలో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడుతూ షూటింగ్ లొకేషన్స్ తో పాటు ఆ సినిమా చిత్రీకరణ సమయంలో అవాంతరాలు సృష్టిస్తూ పెర్ఫార్మ్ చేయకుండా షూటింగ్ లోకేషన్ లో అన్ ఈజీ వాతావరణం క్రియేట్ చేసే మనుషుల మధ్య రావు రమేష్ గారితో ఈ సినిమాలో నటించడం నాకు ఎంతో కంఫర్ట్ గా అనిపించింది అంటూ కామెంట్స్ చేసింది. దీంతో సిని పరిశ్రమలో డిస్కషన్ జరుగుతున్నాయట. ఇంద్రజను అంతగా ఇబ్బంది పెట్టిన ఆర్టిస్ట్ ఎవరు అంటూ అందరూ ఆలోచిస్తున్నారట.

ఇదిలా ఉండగా.... ఇటీవల జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం థాంక్స్ మీట్ లో ఆమె మాట్లాడుతూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సిని పరిశ్రమలో మేల్ పాత్రలకు లభించిన ప్రాధాన్యత పాత్రలు, నటనకు స్కోప్ ఉన్న పాత్రలు, మహిళలకు లభించడం లేదు. సినీ పరిశ్రమలోని మహిళలు అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. మాకు ఉన్న అతి తక్కువ స్కోప్ లోనే మమ్మల్ని మేము నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ మాట్లాడారు. మా ఫిమేల్ ఆర్టిస్టుల్లో కూడా మంచి సత్తా దాగి ఉంటుందని ఆమె సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇంద్రజ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: