టాలీవుడ్ హిస్టరీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనది. అలాగే టాలీవుడ్ లో వైజయంతీ మూవీ అధినేత అశ్వినీ ద‌త్‌ బ్యానర్ కు ఎంతో క్రేజ్ ఉంది. చిరంజీవి, అశ్వినీ ద‌త్ కాంబినేషన్‌లో మొత్తం నాలుగు సినిమాలు వస్తే.. మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో 2002లో వచ్చిన ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ రోజుల్లో నే ఇంద్ర 122 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోని ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ అయిన ఇంద్ర సినిమా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది.


ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం దర్శకుడు బి. గోపాల్ రచయితలు పరుచూరి బ్రదర్స్, ఈ సినిమా స్టోరీ రైటర్ చిన్నికృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత అశ్విని దత్.. చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ వారితో ఇంద్ర సినిమా షూటింగ్ సమయం నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీద‌త్ తో మాట్లాడుతూ ఇంద్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలకు సీక్వెల్స్‌ కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారని.. తప్పనిసరిగా వాటికి త్వరలోనే సీక్వెల్స్ వస్తాయని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తామని తెలిపారు.

ఇంద్ర‌, జగదేకవీరుడు అతిలోకసుందరి రెండు సినిమాల సీక్వెన్స్ అనగానే ఆ సీక్వెల్స్ లో ఎవరు నటిస్తారు..? అన్నది కూడా ఆసక్తిగా మారింది.ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సీక్వెల్ వస్తే.. ఆ సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కూడా గతంలో దీని గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సీక్వెల్ వస్తే.. చరణ్, జాన్వి కపూర్ జంటగా నటిస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఇంద్ర సినిమా సీక్వెల్ లోను చిరంజీవి నటిస్తారా..? లేదా ఆయన తనయుడు రామ్ చరణ్ నటిస్తారా...? అన్న ప్రశ్నలకు కొద్ది రోజులు ఆగితే కాలమే సమాధానం చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: