అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి ఇప్పటికే మీడియాలో ఎన్నో వార్తలు చూసాం. అయితే తాజాగా మరో న్యూస్ మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే..అల్లు అర్జున్,సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ని కలవడానికి ఈ ఇద్దరు అస్సలు ఇష్టపడడం లేదట.. మరి ఇంతకీ ముగ్గురు ఒకే దగ్గర ఎందుకు ఉన్నారు  అనే విషయంలోకి వెళ్తే..ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా మట్కా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతుంది.ఇక మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ఈయన కూడా ప్రస్తుతం ఈ ఇద్దరు షూటింగ్ చేసే ప్లేస్ లోనే ఉన్నారు.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే తెరకెక్కిస్తున్నారట. 

అలా ముగ్గురు ఒకే ప్రదేశంలోనే ఉన్నారు. ఇక షూటింగ్ లో బ్రేక్ వచ్చినప్పుడల్లా ఓకే ప్లేస్ లో ఉన్న సాయి ధరంతేజ్,వరుణ్ తేజ్ లు కలుసుకుంటూ, మాట్లాడుకుంటూ టీ, టిఫిన్స్, భోజనం వంటివి కలిసి చేస్తున్నారట. కానీ వీళ్ళిద్దరితో పాటు అక్కడే ఉన్న అల్లు అర్జున్ ని మాత్రం కలవడానికి అస్సలు ఇష్టపడడం లేదట.దీనికి కారణం మనకు తెలిసిందే.అలా ఒకే చోట ఉన్నా కూడా సాయిధరమ్ తేజ్,వరుణ్ తేజ్ లు అల్లు అర్జున్ ని దూరం పెడుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.దీంతో అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ లోని హీరోలతో ఎంత దూరం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరి చూడాలి ఇప్పటికైనా అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ కి మధ్య ఉన్న దూరం తగ్గిపోతుందా.. లేక అలాగే పెరుగుకుంటూ పోతుందా.. అనేది. అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పటికీ అల్లు అరవింద్ మాత్రం దగ్గరగానే ఉంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో అల్లు అరవింద్,మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనిపించారు.అలాగే ఈ సమయంలో అల్లు అర్జున్ పిల్లలు కూడా మెగాస్టార్ తో సందడి చేశారు. మరి వీరి ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని ఎన్ని వార్తలు వచ్చినా కూడా అటు అల్లు ఫ్యామిలీ గాని, ఇటు మెగా ఫ్యామిలీ గానీ స్పందించడం లేదంటే ఇద్దరి మధ్య గొడవలు నిజమే అనిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: