ముంబయి భామలు ఎందరో తెలుగు చిత్రసీమలో వెలిగిపోయారు. బాలీవుడ్‌లో పుట్టి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మరో ముంబయి అందం భాగ్యశ్రీ బోర్సే. అరంగేట్రంతోనే మాస్‌ మహారాజా రవితేజ సరసన చాన్స్‌ కొట్టేసింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’ను మెప్పించిన ఈ సుందరి.. వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. ఓవర్‌ నైట్ స్టార్‌గా ఎదిగింది. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్‌ బచ్చన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. 

మిస్టర్‌ బచ్చన్‌ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ముంబయి అందం భాగ్యశ్రీ బోర్సే  బ్యూటీ మాత్రం భారీ క్రేజ్‌ దక్కించుకుంది. ఈ సినిమాలో తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో భాగ్యశ్రీ ముందువరుసలో ఉన్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిస్టర్‌ బచ్చన్‌ మూవీ సెట్స్‌పై ఉండగానే భాగ్యశ్రీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. 

గౌతమ్‌ తిన్ననూని దర్శకత్వంలో ‘వీడీ12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసిసట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా భాగ్యశ్రీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే ఇంత క్రేజ్‌ దక్కించుకున్న ముంబయి అందం భాగ్యశ్రీ బోర్సే  బ్యూటీ సోషల్‌ మీడియాలో కూడా చాలా క్రేజ్‌ ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: