వేణు స్వామి పై ఇప్పటికే ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ ఆయన గుట్టు మొత్తం రట్టు చేస్తున్నారు టీవీ 5 జర్నలిస్టు మూర్తి..ఇక ఎప్పుడైతే తనపై ఐదు కోట్ల నింద వేశారో అప్పటి నుండి మూర్తి వేణు స్వామి విషయాన్ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారో ఏమో తెలియట్లేదు కానీ ఆయనకు సంబంధించిన సన్నిహిత విషయాలు కూడా బయట పడేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా టీవీ5 మీడియా ఛానల్ తో ఆయన మాట్లాడుతూ వేణు స్వామి పై సంచలన కామెంట్లు చేశారు. టీవీ 5 జర్నలిస్టు మూర్తి మాట్లాడుతూ.. వేణు స్వామి గురించి ఇప్పటికే అందరూ చూస్తూనే ఉన్నారు.ఆయన బాగోతం ఎలాంటిదో, ఆయన నిజ జీవితం ఎలాంటిదో మీకు అర్థం అయ్యే ఉంటుంది.క్యాసినో ఆడుతాను.. పబ్బులు నడుపుతాను.. మాంసాహారం తింటాను.. మద్యపానం తాగుతాను అని బ్రాహ్మణులు ఎవరు చెప్పుకోరు.

కానీ ఈయన మాత్రం అలా చెప్పడం సిగ్గుచేటు. ఇక ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఈయన ఆడుకుంటున్నారు.ఎందుకంటే ఈయన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో 13 ఏళ్ల బాలికకు యోని పూజలు చేయాలి.. నగ్న పూజలు చేయాలి అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇక ఇలాంటి మాటలు మాట్లాడే వేణు స్వామిని నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి లోపల వెయ్యాలి.అసలు అమ్మాయిల గురించి,బాలికల గురించి నగ్న పూజలు, యోని పూజలు అని అసహ్యంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడే వారు ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే ముందుగా అరెస్టు చేయాలని నా అభిప్రాయం.

ఇక ఈ పూజలు అనేవి ఏ సాంప్రదాయంలో ఉన్నా వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఇలా పబ్లిక్ ప్లేసుల్లో పబ్లిక్ ఇంటర్వ్యూలలో యోని పూజలు, నగ్న పూజలు అని ఆడవాళ్ళ గురించి చెప్పడం అస్సలు బాలేదు అంటూ వేణు స్వామి పై టీవీ పై జర్నలిస్టు మూర్తి ఫైర్ అయ్యారు. నాకు పెద్ద పెద్ద డాన్ లతో సంబంధాలు ఉన్నాయని,  రేవన్న, గాయత్రి ప్రజాప్రతి వంటి వాళ్లు జైలు జీవితం గడుపుతున్నారు. కానీ వారిని జైలు జీవితం గడపకుండా జైలులోకి వెళ్లకుండా పూజలు చేయిస్తానని వాళ్లకు కల్లబొల్లి మాటలు  చెప్పారు కాబట్టే నేను వేణు స్వామిని టార్గెట్ చేశాను అంటూ టీవీ ఫైవ్ మూర్తి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: