కోలీవుడ్ లో మాత్రమే కాకుండా, టాలీవుడ్ లో కూడా అభిమానులని సంపాదించుకున్న నటుడు ఎస్.జే. సూర్య. ఈ నటుడు తదుపరి సరిపోదా శనివారం చిత్రంలో కనిపించనున్నాడు. హీరో నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించగా, ఎస్‌ జేసూర్య నెగటివ్‌ రోల్‌ చేశారు.  ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సరిపోదా శనివారం టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న ఎస్జే సూర్య గురించి మాట్లాడుతూ.. ఆయన అద్భుతమైన దర్శకుడని.. అలాగే అద్భుతమైన నటుడు అని కొనియాడారు. తాను తీసిన హనుమాన్ లో ఓ పాత్ర కోసం ఎస్జే సూర్యను అనుకున్నామని.. కానీ ఆయన రెమ్యునరేషన్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. కానీ తర్వాతి చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాని అన్నారు. అయితే హనుమాన్ లో ఏ పాత్రకు ఎస్జే సూర్యను అనుకున్నారో మాత్రం చెప్పలేదు. ఈమూవీలో ప్రతినాయకుడి పాత్రలో వినయ్ రాయ్ పోషించారు.

దర్శకుడిగా ఎన్నో హిట్స్ అందుకుని తనదైన ముద్ర వేసిన సూర్య.. కొంతకాలంగా నటుడిగా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే రాయన్ తో సూపర్ హిట్ అందుకున్నారు.  ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ హీరో నటించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్, విజువల్స్, తేజ సజ్జా యాక్టింగ్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. తెలుగుతోపాటు మిగతా భాషలలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. త్వరలోనే హనుమాన్ కు సీక్వెల్ తీసుకురానున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: