హీరోయిన్‌గా చెలామణి అవుతున్న నటి త్రిష. కెరీర్‌ మొదట్లో పలు డబ్బింగ్‌ సినిమాలతో పలకరిచిన ఈ అమ్మడు 2003లో తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే స్ట్రయిట్ సినిమా చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు మీద హిట్లు కొడుతు స్టార్ హీరోయిన్‌ రేంజ్‌కు దూసుకుపోయింది. నాలుగు పదుల వయసు దాటినా వన్నె తరగని అందంతో యూత్‌ను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది.స్టార్ హీరోయిన్లు అంతా ఇప్పుడు ఐటం నంబ‌ర్ల ఆఫ‌ర్లు వ‌స్తే ఏమాత్రం మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజాహెగ్డే, శ్రుతిహాస‌న్ ఇలా ఏ ఒక్క‌రు ఐటం పాట అంటే త‌గ్గేదేలే! అంటూ చెల‌రేగుతున్నారు. హీరోయిన్ గా కొన‌సాగుతూనే ఆ ర‌క‌మైన అవ‌కాశాలు సై తం స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక అవ‌కాశాలు లేని భామ‌లకైతే ఇలాంటి అవ‌కాశం వ‌స్తే? అదే మ‌హా ప్ర‌సాదంగా భావిస్తున్నారు.కానీ అందాల త్రిష మాత్రం ఇంత‌వ‌ర‌కూ ఆ ఛాన్స్ తీసుకోలేదు. అమ్మ‌డు ఎంతో మంది సీనియ‌ర్ హీరోల‌తో ప‌నిచేసింది. సెకెండ్ ఇన్సింగ్స్ ని సైతం అదే దూకుడుతో ముందుకు తీసుకెళ్తోంది. పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత అమ్మ‌డి కెరీర్ మ‌రింత స్పీడప్ అయింది. ఇప్పుడున్న ద‌శ‌లో త్రిష కి ఐటం పాట‌లు చేసే అవ‌స‌రం లేదు. మ‌రి అలాంటి త్రిష ఇప్పుడు స్నేహితుడు త‌ల‌ప‌తి విజ‌య్ కోసం ఛాన్స్ తీసుకుంటుందా? అంటే అవున‌నే గుస గుస వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా వెంక‌ట్ ప్రభు తెర‌కెక్కించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిదే. మ‌రో ప‌ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే సినిమా లిరిక‌ల్ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో త్రిష ఇదే సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ లో ఆడిపాడిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. నేరుగా థియేట‌ర్లో త్రిష స‌డెన్ ఎంట్రీతో స‌ర్ ప్రైజ్ చేయాల‌నే మేక‌ర్స్ విష‌యాన్ని గోప్యంగా ఉంచిన‌ట్లు వినిపిస్తోంది. మ‌రి ఇది నిజ‌మైతే సంచ‌ల‌న‌మే.త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని ఆయన అన్నారు.తమిళంలో విజయ్‌-త్రిష హిట్‌పెయిర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. వారిద్దరు కలిసి ఐదు చిత్రాల్లో నటించగా.. అవన్నీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సాధించాయి. దాంతో హిట్‌ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వారిద్దరిపై ఓ స్పెషల్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేశారని తెలిసింది. 'గోట్‌’ తెలుగు వెర్షన్‌ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తున్నది.మాములుగా హీరోయిన్ల కెరీర్‌ కొంత కాలమే ఉంటుందని అంటుంటారు. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా వయసు పెరిగేకొద్ది బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో అలరిస్తుంది. అవి కూడా ఆశా మాశీ ప్రాజెక్ట్‌లు కావు. ప్రస్తుతం ఈ అమ్మడి లైనప్‌ చూస్తుంటే.. ఇప్పుడున్న యంగ్ స్టార్‌ హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం త్రిష లైనప్‌లో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అందులో మూడు స్టార్‌ హీరోల సినిమాలే. అజిత్ హీరోగా నటిస్తున్న’ విదా మువర్చి’లో త్రిషనే హీరోయిన్‌గా నటిస్తుంది. వీటితో పాటుగా కమల్‌-మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ త్రిషనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇక ‘దృశ్యం’ సిరీస్‌ దర్శకుడు జీతూ జోసెఫ్‌, మోహన్‌లాల్‌తో తీయబోయే రామ్‌ సినిమాలోనే త్రిషనే నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: