తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యువ హీరో రాజ్ తరుణ్‌ గురించి తెలియని వారుండరు. తన క్యూట్ స్మైల్, నటనతో అభిమానుల హృదయాలను దోచుకున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ గా నటించిన మూవీ పురుషోత్తముడు. జూలై 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కాని హీరో రాజ్ తరుణ్సినిమా పై భారీ  అంచనాలు పెట్టుకున్నాడు. ఇకపోతే ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న విషయం తెలిసిందే.

 కాగా  ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా దక్కించుకుంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక పురుషోత్తముడు సినిమాలో రాజ్ తరుణ్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో కుటుంబ బంధాలను, సమాజంలోని విలువలను  చూపించారు. ఈ సినిమాను రామ్ భీమన డైరెక్ట్ చేయగా రమేశ్ తెజావత్, ప్రకాశ్ తెజావత్ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో హాసిని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

 అంతే కాకుండా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఇది కాసేపు పక్కన పెడితే రాజ్ తరుణ్, లావణ్య కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తి లావణ్య మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఆరోపించింది. లావణ్య చేసిన ఆరోపణల నేపథ్యంలో రాజ్ తరుణ్ పై పోలీసు కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరి వాదనలు విని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎవరు నిజం, ఎవరు అబద్ధం అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అయితే, ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.ఈ కేసులో కొత్త కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇరువురి మధ్య జరిగిన కాల్ రికార్డులు, చాట్‌లు, ఫోటోలు వంటివి మీడియాలో లీక్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ కెరీర్‌పై ఈ కేసు ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది ఆసక్తికరంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: