సోషల్ మీడియాలో భారీ క్రేజీ సంపాదించిన వారు సెలబ్రెటీలు గా మారిపోతున్నారు. మరి కొంతమంది డ్యాన్సులతో పాటలతో కూడా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.అలా తమ టాలెంట్ ని చూపిస్తే బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఒక్క వీడియోతోనే కథానాయక అవకాశం సంపాదించుకున్నది శ్రీ లక్ష్మీ సతీష్.. ఈమె పేరు పాపులర్ కావడానికి ముఖ్య కారణం రాంగోపాల్ వర్మ అని చెప్పవచ్చు.. ఏమైనా ముద్దుగా ఆర్జీవి ఆరాధ్య దేవి అని పిలుస్తూ ఉంటారు. చీర కట్టులో ఇన్స్టాల్ల్స్ తో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.


ఇంస్టాగ్రామ్ లో అభిమానులకు వర్మ ఈమె కోసం వెతకమని సూచించడంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అప్పటినుంచి శ్రీ లక్ష్మీ సతీష్ పేరు భారీ క్రేజ్ సంపాదించడమే కాకుండా ఆమెతో శారీ అనే ఒక చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. శారీ పోస్టర్తోని శ్రీలక్ష్మి సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ రీల్స్ చేయడమే కాకుండా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీలక్ష్మి కళ్ళు, నడుము, ఏజ్ గురించి పలు రకాల ప్రశ్నలు అడగగా వివరాలను కూడా చెప్పేసింది. శ్రీలక్ష్మి ప్రస్తుత వయసు 22 సంవత్సరాలట.తనకు ఇప్పుడిప్పుడే తెలుగు కొద్దికొద్దిగా నేర్చుకుంటున్నానని.. అది కూడా శారీ సినిమా కోసం నేర్చుకుంటున్నానని తెలిపింది. ఈమె హైట్ 5.8 అంగుళాలట. అయితే ఈమె ఒకప్పుడు బాడీ షేమింగ్స్ వంటి కామెంట్లు కూడా ఎదుర్కొన్నానని అలాగే తన కలర్ శరీరాకృతి గురించి కూడా చాలామంది విమర్శించారని అలా విమర్శించిన వారే ఇప్పుడు తన సినిమాల కోసం ఫోటోల కోసం వీడియోల కోసం ఎదురుచూసి ఉన్నారంటే తెలియజేస్తోంది. అయితే తను ఇలా కనిపించడం కోసం చాలా త్యాగాలు చేశానని కష్టమైన వర్కౌట్లు కూడా చేసి మరి అందంగా మారానని తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: