ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గత కొద్ది రోజులుగా మీడియాలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయన తప్పుడు జ్యోతిష్యం చెబుతూ ఎంతో మంది పర్సనల్ జీవితాలను పబ్లిక్ గా బయటపెడుతున్నారంటూ మహిళ కమిషన్ ఈయనపై కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా జర్నలిస్టు టీవీ ఫైవ్ మూర్తి కూడా ఈయన బాగోతాలు బయటపెడుతున్నారు.అయితే ఇలాంటి నేపథ్యంలో మూర్తి నన్ను 5 కోట్లు అడిగాడని మా దగ్గర 5 కోట్లు ఇచ్చుకునేంత స్తోమత లేదని,డబ్బులు ఇవ్వకపోతే మా పరువు మొత్తం పోగొడతామని  చెబుతున్నారని, మేము అంత ఇచ్చుకునే పరిస్థితిలో లేము సూసైడ్ చేసుకోవడమే మాకు గతి అంటూ వేణు స్వామి దంపతులు మాట్లాడారు. అయితే ఈ విషయంపై మూర్తి సీరియస్ అయ్యి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు.మూర్తి అనుచరుడిని అంటూ అమర్ అనే వ్యక్తి ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టు ఆడియో కాల్ రికార్డు వైరల్ అయింది. అయితే ఆ ఆడియో కాల్ మాట్లాడింది ఎవరో త్వరలోనే బయటపెడతానని చెప్పిన మూర్తి రీసెంట్ గానే కీర్తి రెడ్డి అనే అమ్మాయి ఈ మాటలు మాట్లాడిందని చెప్పారు. అయితే ఇందులో మాట్లాడిన అమర్ అనే వ్యక్తిని కూడా మీడియా లైవ్ లోకి తీసుకువచ్చి ఆయనకి సంబంధించిన సమాచారాలు అడిగి తెలుసుకున్నారు మూర్తి. 

అయితే కీర్తి రెడ్డి వేణు స్వామికి చాలా సన్నిహితురాలు. ఆమెనే నన్ను భయపెట్టి కొంత మంది మీడియా ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన ఎన్నో కాల్స్ రికార్డింగ్ చేయించింది.అలాగే కొద్దిరోజులు అయ్యాక నేను వాళ్ళు చెప్పింది వినకపోతే నన్ను మాటలతో భయపెట్టింది. వేణు స్వామి క్షుద్ర పూజలు చేస్తాడు. టీవీ5 మూర్తి పై కూడా అలాంటి పూజలు చేస్తున్నాడు. నేను చెప్పింది వినకపోతే నీ కుటుంబాన్ని నిన్ను వేణు స్వామి నాశనం చేస్తాడు. బాణామతి, చేతబడి వంటివి చేస్తాడు అంటూ కీర్తి రెడ్డి నన్ను భయపెట్టించింది అని అమర్ అనే వ్యక్తి మీడియా ఛానల్ లైవ్లోనే ఈ విషయాన్ని బయట పెట్టారు.

అలాగే నన్ను ఓ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్లి ఇవేవీ విషయాలు మాట్లాడకుండా ఆ వ్యక్తితో ఫిలిం ఛాంబర్ దగ్గర మంచు విష్ణు తో ఫిలిం ఛాంబర్ ఇష్యూ,ఫిలిం జర్నలిస్టుల కి సంబంధించిన ఇష్యుని క్లియర్ చేయమని చెప్పింది అంటూ అమర్ అనే వ్యక్తి మీడియా లైవ్ లోనే ఈ విషయాన్ని బయట పెట్టేశారు. దీంతో క్షుద్ర పూజలపై స్పందించిన టీవీ5 మూర్తి నేను ఆ క్షుద్ర పూజలన్నింటికీ భయపడను. ఐ డోంట్ కేర్.ఇవ్వాళ చస్తే రేపు రెండో రోజు అవుతుంది. దాన్ని నేను పట్టించుకోను. ప్రధానమంత్రి,రాహుల్ గాంధీ వంటి వారినే నేను టార్గెట్ చేశాను. నేను దేనికి భయపడను అంటూ కౌంటర్ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ వేణు స్వామి చెప్పినట్లు వినకపోతే క్షుద్ర పూజలు చేస్తాడని కీర్తి రెడ్డి తనను భయపట్టించింది అంటూ అమర్ చెప్పిన మాటలు మాత్రం మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: