సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో సహజీవనం చేసి రెండు మూడు సార్లు కడుపు కూడా తీయించారంటూ తనని మోసం చేశాడు రాజ్ తరుణ్ అంటూ కేస్ ఫైల్ చేయడమే కాకుండా మీడియా ముందు చేసిన హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ విషయం తిరగబడరా సామి అనే ట్రైలర్ లాంచ్ ప్రమోషన్స్ నుంచి ఈ విషయం మరింత వైరల్ గా మారింది. అలా రాజు తరుణ్, మాల్వి మల్హోత్ర పైన కూడా కేసు పెట్టింది లావణ్య.


అలా ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ మధ్యనే అటు లావణ్య కూడా చల్లబడిపోయింది ఇటు రాజ్ తరుణ్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే ఈ వివాదం మాత్రం ఇప్పుడు తను నటిస్తున్న భలే ఉన్నాడు అనే సినిమా మీద ఎఫెక్ట్ పడేలా ఉన్నది ఇప్పటికే రెండు సినిమాల మీద ఈ ఎఫెక్ట్ చాలా పడినట్లు తెలుస్తోంది. భలే ఉన్నాడు చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన రాబోతున్నది. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ సాయి వర్ధ దర్శకత్వం వహిస్తున్నారు.


అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ కి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురయ్యింది.. అదేమిటంటే రాజ్ తరుణ్ సినిమాలు వరుసగా వస్తున్నాయి..సినిమాలను ప్రమోట్ చేసేందుకు లావణ్య ఇలా చేస్తుందా అన్నట్లుగా ప్రశ్నించగా.. ఇలాంటి ప్రమోషన్స్ ఎవరైనా చేస్తారా అంటూ రాజ్ తరుణ్ ఆశ్చర్యపోయారు.. ఇలాంటి ప్రశ్న అడగడం తనకు జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. ఎవరైనా కూడా ఇలాంటి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డును వేసుకోవడానికి ఏ హీరో కూడా ఇష్టపడరు దీన్ని ప్రమోషన్ గా ఎలా ఫీలవుతారు అంటూ రాజ్ తరుణ్ వెల్లడించారు . ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్లో ఒక మహిళ మాస్క్ కట్టుకొని రాజు తరుణ్ కి మేటర్ లేదని విషయాన్ని తెలియజేయడంతో ఇది కూడా సినిమా ప్రమోషన్ స్టంటే అని అందరూ భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: