కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండియాలోని ప్రేక్షకులు ఎక్కువగా ఓ టి టి కంటెంట్ ను చూసేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా వరకు మారాయి. కరోనా సమయంలో థియేటర్లు మూత పడడం , టీవీ లలో కూడా కొత్త కంటెంట్ ఏది రాకపోవడంతో జనాలు ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ ను వీక్షించడానికి ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. దానితో జనాలు ఓ టీ టీ లకు బాగా అలవాటు పడ్డారు. ఇక కరోనా ముగిసింది. థియేటర్లు ఓపెన్ అయ్యాయి. టీవీ లలో కూడా కొత్త కంటెంట్ ఫుల్ గా ఉంది. 

అయినప్పటికీ ఓ టీ టీ కి అలవాటు పడ్డ ప్రేక్షకులు అందులోని కంటెంట్ నీ చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దానితో ఓ టీ టీ లలో కూడా ప్రతి వారం మంచి కంటెంట్ వస్తుంది. అలాగే కొత్త కొత్త ఓ టీ టీ లు కూడా వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈటీవీ సంస్థ వారు ఈ టీవీ విన్ అనే పేరుతో ఓ ఓ టీ టీ సంస్థ ను ప్రారంభించారు. ఈ సంస్థ వారు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇప్పటివరకు ఈటీవీ విన్ లో వచ్చిన కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇకపోతే సంస్థ వారు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు. ఈటీవీ సంస్థ 29 వ యానివర్సరీ సందర్భంగా ఈటీవీ విన్ నెల రోజుల సబ్స్క్రిప్షన్ కేవలం 29 రూపాయలకే ఇవ్వనున్నట్లు ఈ ఆఫర్ కి కేవలం ఆగస్టు 27 , 28 , 29 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: