టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి శెట్టి ఈ సినిమాలో శర్వానంద్ కి జోడిగా నటించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... వాషిం అబ్దుల్ వహేబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎంత లాభం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 4 కోట్లు , సీడెడ్ ఏరియాలో ఒక కోటి , ఆంధ్ర ఏరియాలో 4.26 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 9.26 కోట్ల షేర్ ... 18 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 60 లక్షలు , ఓవర్ సీస్ లో 1.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. టోటల్ గా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 11.03 కోట్ల షేర్ ... 21.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ లోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 1.03 కోట్ల లాభాలను అందుకొని క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: