ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఈ మూవీ లోని తన నటనకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత కొంత కాలం క్రితం అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని తమిళ దర్శకుడు అట్లీ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ ఆగిపోయింది అని ఆ తర్వాత వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే మళ్ళీ ఈ కాంబో మూవీ కి సంబంధించిన వార్తలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ , అట్లీ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు , ఒక వేళ అన్ని కుదిరినట్లయితే ఈ కాంబో లో సినిమా సెట్ కానున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు రానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే అల్లు అర్జున్ స్నేహితుడు , సన్నిహితుడు అయినటువంటి బన్నీ వాసు , అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా చాలా పెద్ద రేంజ్ లో ఉండబోతుంది.

సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పడుతుంది అని చెప్పాడు. దానితో త్రివిక్రమ్ , అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే లోపు అల్లు అర్జున్మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అన్ని కుదిరితే అట్లీ తో స్పీడ్ గా ఓ మూవీ కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa