మహానటి సావిత్రి దారుణ స్థితిలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మహానటి సినిమా ద్వారా ఆమె జీవితం ఎలా మొదలైంది ఎలా అంతమైంది అనేది కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెర ముందు మనకు చూపించారు. అయితే సినిమాలో చూపించలేని ఎన్నో అంశాలు ఇంకా సావిత్రి జీవితంలో ఉన్నాయట. అవి చీకటి కోణాలు అని కూడా కొంత మంది అంటుంటారు.అయితే సావిత్రి జీవితం అలా అవడానికి ప్రధాన కారణం ఆమె నమ్మినవాళ్లే అని అంటూ ఉంటారు సావిత్రి సన్నిహితులు. అంతేకాదు సావిత్రి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న జెమినీ గణేషన్ కూడా ఆమెను మోసం చేశాడని,అలాగే నా అన్న వాళ్లు కూడా సావిత్రిని అవసరానికి వాడుకొని ఆ తర్వాత వదిలేసారని అంటూ ఉంటారు.ఇక కడుపున పుట్టిన కన్న కూతురు కూడా సావిత్రిని చివరి రోజుల్లో పట్టించుకోలేదట. 

అప్పట్లోనే సావిత్రి తను సంపాదించిన డబ్బుతో తన కూతురు విజయ చాముండేశ్వరిని చాలా డబ్బున్న ఇంటికి కోడలుగా పంపించిందట. ఇక కట్నం కూడా అప్పట్లో ఎక్కువగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అలా అపురూపంగా పెంచి లక్షలకు లక్షలు కట్నం ఇచ్చిన కూతురు చివరి రోజుల్లో సావిత్రిని దగ్గరికి రానివ్వలేదట. అంతేకాదు సావిత్రి డబ్బులు అన్ని లాక్కొని ఆస్తులు అన్ని రాయించుకుందట.అయితే మహానటి సినిమా దర్శకత్వం వహించే సమయంలో చిత్ర యూనిట్ కి విజయ చాముండేశ్వరి చాలా దగ్గరగా ఉందని, ఎందుకంటే మహానటి మూవీలో తనకి సంబంధించిన సీక్రెట్ విషయాలు ఎక్కడ బయటపెడతారో అని బయటపడి ముందుగానే చిత్ర యూనిట్ సాన్నిహిత్యంగా మెదిలిందని కే.వి చౌదరి మనవరాలు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది.

అంతేకాదు సావిత్రి బతికుండగానే కూతురు ఆస్తులు లాక్కొని ఎంతో టార్చర్ చేసింది అని కె.వి చౌదరి మనవరాలు చెప్పిన విషయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.ఇక కూతుర్ని పెద్దింటికి కోడల్ని చేసినా కూడా చివరి రోజుల్లో సావిత్రి దగ్గర చిల్లిగవ్వ లేనప్పుడు కూతురు చేరదీయ లేదట. అంతేకాదు సావిత్రి చనిపోయాక  అందరికంటే ముందు ఆస్తికోసం అక్కడికి వచ్చిందని కె.వి చౌదరి మనవరాలు విజయ చాముండేశ్వరి పై సంచలన కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: