గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్  కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌ మినహా సరైన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ నుంచి రాలేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని డబ్బింగ్ కార్యక్రమాలను  జరుపుకుంటున్నట్లుగా..

 అందుకు సంబంధించిన ఫొటోలతో మేకర్స్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ  అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ రూమర్లేనని 'మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌'లో పాల్గొన్న దిల్‌ రాజు స్పష్టం చేశారు. ఇంతకముందు చెప్పినట్టు ఈ ఏడాది క్రిస్మస్‌కే సినిమా విడుదలవుతుందని వెల్లడించారు. ''సినిమా షూటింగ్‌ పూర్తయింది. రామ్‌ చరణ్‌, శంకర్‌ ఇమేజ్‌ను ఈ సినిమా మారుస్తుంది. మంచి విజయం అందుకుంటుంది. 

పొలికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్‌ గతంలో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. 'రోబో'తో ఆయన పంథా మార్చుకున్నారు'' అని తెలిపారు. ఇక ఏ సినిమాలోకి ఏరా ఆద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు అంజలి సైతం మరో కీలక పాత్రలో కనిపించబోతోంది.‘గేమ్ చేంజర్’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. క్రిస్మ‌స్  సంద‌ర్భంగా ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: