ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషనల్ వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప.  ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. నీయవ్వి తగ్గేదేలే  అంటూ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. అంతేకాక ఈ సినిమాతో అల్లు అర్జున్ ను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సినిమాకు స్వీక్వెల్ గా త్వరలో పుష్ప 2  ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ‘పుష్ప 2’ కోసం సినీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మూవీ టీమ్ క్లైమాక్స్ ను

 చిత్రీకరించే పనిలో ఉన్నారు. అయితే పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీస్, క్రికెటర్స్, పొలిటిషియన్స్ చాలామంది ఆ సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ ని ఎక్కడా తగ్గకుండా ఉపయోగించడం మొదలుపెట్టారు. అక్కడితో సినిమా అంచలంచెలుగా ప్రపంచం మొత్తం పాకుతూ పోయింది. అలానే సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కూడా అదే లెవెల్ లో ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. అయితే త్రివిక్రమ్ ఆ సినిమాకి ఎంత టైం తీసుకుంటాడు అనే క్లారిటీ ఇంకా లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా

 ఉండబోతుందనే క్లారిటీ కూడా లేదు. కానీ అల్లు అర్జున్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ అయితే ఉంది. ఇక అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ నాలుగు సంవత్సరాలు వరకు తన ప్లాన్ ఏంటి అని ఆల్రెడీ రీవీల్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం స్పిరిట్ సినిమా చేస్తున్న సందీప్ ఆ తర్వాత అనిమల్ కి సీక్వెల్ చేయనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: