టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో ‘దేవర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా చేస్తున్నారు నిర్మాతలు. కాగా దేవర చిత్రాన్ని ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి  షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు

 రైట్స్ కొనుగులు చేసిన నాగవంశీ. సెప్టెంబరు 27న తెల్లవారు జామున 1.08 గంటలకు బెన్ ఫిట్ షో లు రెండు తెలుగు రాష్ట్రాలలోసెలక్టెడ్ థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. వచ్చే నెల 27 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి ఇప్పటి నుండి ఫ్యాన్ షోస్ ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే లండన్ లో పలు లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, 3 వేల పౌండ్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ కూడా కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్

 షోస్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా షోస్ మార్చి 27 అర్థ రాత్రి 1 గంట నుండి ప్రారంభం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే అభిమానులను వణుకుపుట్టిస్తున్న విషయం. ఎందుకంటే మన టాలీవుడ్ లో అర్థ రాత్రి నుండి షోస్ ప్రారంభమై టాక్ తెచ్చుకున్న చిత్రాలు చాలా తక్కువ ఉన్నాయి. ‘సలార్’, ‘బాహుబలి 2’ వంటి చిత్రాలకు మాత్రమే ఈ అర్థరాత్రి షోస్ వర్కౌట్ అయ్యాయి. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలకు మాత్రం ఈ అర్థరాత్రి షోస్ బాగా దెబ్బ వేసాయి. అలా దేవరా విషయంలో కూడా ఇదే జరుగుతుందేమో అని భయపడుతున్నారు ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: