తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ కరోనా తర్వాత నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకున్నాయి. మరి కరోనా తరువాత ధనుష్ ఏ సినిమాలలో నటించాడు. ఆ మూవీలకు ఏ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కరోనా తర్వాత మొదటగా ధనుష్ "కర్ణన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని 67 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఆ తర్వాత ధనుష్ "తిరు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 117 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ధనుష్ "సార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 118 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ధనుష్ "నానే వరువెన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. 

సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు 37 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక కొంత కాలం క్రితం ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు 75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక కొంత కాలం క్రితమే ధనుష్ "రాయన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా ఏకంగా 156 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా కరోనా తర్వాత ధనుష్ నటించిన ఆరు సినిమాలలో నాలుగు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: