ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం "పుష్ప పార్ట్ 1" మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. సమంతసినిమా కంటే ముందు ఎప్పుడూ ఐటెం సాంగ్ లో నటించలేదు. ఆ తర్వాత కూడా నటించలేదు. అలా కెరియర్ లో మొట్ట మొదటి సారి సమంత ఐటెం సాంగ్ లో నటించడంతో ఈ మూవీ ఐటెం సాంగ్ పై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదల అయిన తర్వాత సమంత ఈ సాంగ్ లో తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సాంగ్ దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇకపోతే ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ చిత్రీకరణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పుష్ప మొదటి భాగంలో ఐటమ్ సాంగ్ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కావడంతో పుష్ప రెండవ భాగంలో లో కూడా అదే స్థాయిలో ఐటమ్ సాంగ్ ఉండే విధంగా మేకర్స్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే "పుష్ప పార్ట్ 2" లో ఆ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయబోతోంది ... ఈ బ్యూటీ ఐటెం సాంగ్ చేయబోతుంది అని పలువురు పేర్లు తెర పైకి వచ్చాయి.

తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ అయినటువంటి జాన్వీ కపూర్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈమె దాదాపుగా ఒక సినిమాకు 5 నుండి 6 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు అందులో దాదాపు సగం వరకు ఒక ఐటమ్ సాంగ్ కి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దానితో పుష్ప పార్ట్ 2 మూవీ లోని ఐటెం సాంగ్ కోసం ఈమె రెండున్నర నుండి మూడు కోట్ల వరకు రెమినరేషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa