బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మి అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకవైపు రష్మి టీవీ షోలో, ఈవెంట్స్ లలో  యాంకరింగ్ చేస్తూ కూడా అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనపడతు ఉంటుంది. అయితే యాంకర్ రష్మి ఇంట్లో ఒక విషాదం చోటుచేసుకుంది. ఆమె తాతయ్య మృతి చెందారు. ఈ విషయాన్ని రష్మినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేసింది. 

ఈ క్రమంలో నానమ్మ, తాతయ్యలను తలుచుకుంటూ వారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయిపోయింది రష్మీ. అయితే తాజాగా రష్మి తన తాతను తెలుసుకొని మరో ఎమోషనల్ పోస్టులు షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా రష్మీ పోస్ట్ చేస్తూ..  ‘మనమే కాదు.. మూగజీవాలు కూడా మా తాతయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాయి. మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. గత ఏడాదిన్నర కాలంగా మీరు నాన్నమ్మను ఎంతగా మిస్ అయ్యారో నాకు తెలుసు. ఇప్పుడు మీరిద్దరూ పైన మళ్లీ కలుసుకుంటారని అనుకుంటున్నాను. నా జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను తాతయ్య. కానీ నా లైఫ్ మొత్తం నానితో, నీతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. 17 ఆగస్టు 2024, 19 జనవరి 2023 ఒక శకం ముగిసింది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.


 ఈ పోస్ట్ కు తన తాతయ్య మృతదేహం వద్ద తన పెట్టు నాకు నిల్చని ఉన్న ఫోటోను జోడి ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ పోస్ట్ ని చూసిన రష్మి అభిమానులు నటించడం రష్మికకు ధైర్యం చెబుతూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అలాగే రష్మీ ఈ  విషాదం నుండి త్వరగా కోలుకోవాలని అంటూ  మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: