ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో టైగర్ నాగేశ్వరరావు దర్శకుడు కూడా ఒకరు. ఆయన ఎవరో కాదు వంశీకృష్ణ , ప్రమీల అనే యువతిని తాజాగా వివాహం చేసుకున్నారు. బుధవారం రోజు ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వివాహానికి ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ సతీసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఇంత సడన్గా పెళ్లి చేసుకున్నావ్ ఏంటి భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నావేంటి అంటూ కామెంట్లు చేశారు. ఏది ఏమైనా చాలా మంది నెటిజెన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక డైరెక్టర్ వంశీ కృష్ణ విషయానికి వస్తే..  టైగర్ నాగేశ్వరరావు సినిమా తీశారు. స్టువర్టుపురం లో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇందులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ హీరోయిన్ కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ కూడా కీలక పాత్ర పోషించింది.ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో అభిషేక అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇకపోతే టైగర్ నాగేశ్వరరావు సినిమా తీయడాని కంటే ముందే దొంగాట అనే సినిమాకి దర్శకత్వం వహించారు వంశీ..ఇందులో అడివి శేష్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు వంశీ. ఏది ఏమైనా వంశీకి ఇకనైనా కలిసి వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: