నందమూరి బాలకృష్ణ సినీ కెరియర్ కు 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా తెలుగు , తమిళ్, కన్నడ , మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీ లందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ లో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి వివిధ భాషా ఇండస్ట్రీల నుంచి ఎవరెవరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు అనే విషయాన్నికొస్తే.. కన్నడ నుంచీ హీరో శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్, తమిళ్ నుంచి హీరో విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, వీరితోపాటు హీరో దునియా విజయ్, దర్శకులు పీ. వాసు, నాజర్ , నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, హీరోయిన్స్ మీనా , సుహాసిని , మాలాశ్రీ ,సుమలత, రవి కొత్తర్కర అలాగే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ హరీష్ తోపాటు చాలామంది ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ అలాగే సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ రాబోతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి అందరూ ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.  వీరితోపాటు చాలామంది స్టార్ హీరోలు,  సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు దిగ్గజ దర్శకులు , బడా నిర్మాతలు కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

ఇక ఇలా చాలామందిని ఈ వేడుకకు ఆహ్వానించారు.  మరొకవైపు ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్ వస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుక చాలా ఘనంగా అట్టహాసంగా నిర్వహించనున్నారు నిర్వాహకులు. మరి సెప్టెంబర్ ఒకటవ తేదీన ఈ వేడుకకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనే విషయం పూర్తిగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: