మలయాళ సినీ పరిశ్రమలో గత వారం రోజుల నుంచి జస్టిస్  హేమ కమిటీ కుదిపేస్తోంది. ఎంతోమంది నటీమణులు సైతం తమ పైన జరిగిన కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మలయాళ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒకప్పటి నటి ఉష పలు రకాల ఆరోపణలు చేసింది.ఒక స్టార్ నటుడు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాలని చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.



1992లో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది నటీనటులు అందరూ కూడా ఒక కార్యక్రమం కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారట.. అయితే అక్కడ షో పూర్తి అయిన వెంటనే ఎయిర్పోర్టుకు  వెళ్లేందుకు సిద్ధమవుతున్న నటీనటులు అందరూ కూడా తమ లగేజ్ తీసుకొని రావాలని అయితే కొద్దిసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకొని బయలుదేరి వెళ్దామని మోహన్లాల్ తెలియజేశారట. దీంతో రెడీ అయ్యి లిఫ్ట్ ఎక్కా.. అయితే అందులో ఆల్రెడీ ఒక సీనియర్ నటుడు ఉన్నారని తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.. దీంతో తనకు కోపం వచ్చి చెంప చెల్లుమనిపించానని తెలిపింది నటి ఉష.


ఈ విషయాన్ని తనతో ఉన్న నటీనటులతో చొప్పగా తాను కరెక్ట్ గానే  స్పందించానని తనకే ఎక్కువ మంది మద్దతు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఆర్గనైజేషన్ వద్ద వరకు తీసుకువెళ్లాగా తాను ఒక అహంకారి అనే విధంగా ముద్రవేశారు. ఆ తర్వాత  సినిమా అవకాశాలు లేకుండా చేశారు. ఆ నటుడు ఎవరనే విషయాన్ని మాత్రం ఈమె పేరు చెప్పలేదు. కానీ ఈ ఘటన తాను ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నానని తెలియజేసింది. మరొకవైపు మోడల్ జ్యోతి మోహన్ కూడా మలయాళ సిని పరిశ్రమలో ఆరోపణలు చేయడం జరిగింది. తాను తీసే సినిమాలు హీరోయిన్గా తనని ఎంచుకుంటానని ఫేస్బుక్లో తనకు మెసేజ్లు పంపారు.. అయితే అందుకోసం ఒక మీటింగ్కు రమ్మన్నారు.. కానీ కాస్త ఆలస్యంగా వెళ్లడంతో క్యాన్సిల్ చేశారు.. ఆ రాత్రి వరుసగా మెసేజ్లు పంపి తను వేధింపులకు గురి చేశారని.. ఉదయం తన ఇంటికి రమ్మని పిలిచారు. నేను రానని చెప్పడంతో తనని సినిమా నుంచి తీసేసారని జ్యోతి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: