యదు వంశీ దర్శకత్వంలో నాగబాబు కూతురు నిహారిక "కమిటీ కుర్రాళ్ళు" అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లో విడుదల అయింది. థియేటర్లో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఈ మూవీ కి సంబంధించిన 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 19 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.98 కోట్ల కలెక్షన్స్ రాగా ... సీడెడ్ ఏరియాలో 99 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.59 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 19 రోజుల్లో 8.56 కోట్ల షేర్ , 15.50 కోట్ల గ్రాస్ కలక్షన్లు వచ్చాయి. 19 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 75 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 9.31 కోట్ల షేర్ , 17.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 3.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఈ మూవీ 6.60 కోట్ల లాభాలను ఇప్పటికే అందుకొని అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: