సౌతిండియా స్టార్‌ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను వేధించిన వారిని చెప్పులతో కొట్టాల్సిందేనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సౌతిండియా స్టార్‌ హీరో విశాల్. ఏ ఇండస్ట్రీలో అయినా.. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని.. కాబట్టి.. ఎవరైనా వేధిస్తే.. వెంటనే చెప్పులతో దాడి చేయాలని కూడా పేర్కొన్నారు విశాల్‌.


సౌతిండియా స్టార్‌ హీరో విశాల్...సోషల్ మీడియాతో  పాటు మీడియాలో బాగా హైలెట్‌ అవుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా స్పందిస్తూ ఉంటారు. తమిళంలోనే కాకుండా... టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కూడా సౌతిండియా స్టార్‌ హీరో విశాల్ కు మంచి పేరుంది. అయితే.. అలాంటి.. సౌతిండియా స్టార్‌ హీరో విశాల్.. కేరళలో ఏర్పాటు చేసిన హేమ కమిటీ, అక్కడ హీరోయిన్లపై జరిగిన వేధింపులపై స్పందించారు.


సినిమా ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆ మహిళల్లో ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని హీరో విశాల్ స్పష్టం చేశారు.  తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారని బాంబ్‌ పేల్చారు హీరో విశాల్. అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరడం జరిగింది. కేరళలో ఏర్పాటు చేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు హీరో విశాల్.


కేరళలో అలా ఆడవాళ్లను వేదించిన పాపానికి వారికి శిక్ష పడాల్సిందేనని డిమాండ్‌ చేశారు హీరో విశాల్.  మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి మగవారిపై ఉంటుందని చెప్పారు హీరో విశాల్.  శ్రీ రెడ్డి ఎవరో నాకు తెలియదు కానీ‌.. ఆమె వేసే జోకులు మాత్రం నేను విన్నానన్నారు. ఎవరి మీద అయినా నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. నిజంగానే ఇబ్బందులు కలిపితే పోలీసులకు ఫిర్యాదు చెయ్యొచ్చు అని వెల్లడించారు హీరో విశాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: