తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ నటించగా ... ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ రోజు అనగా ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశారు.

ఇకపోతే మైత్రి మూవీస్ సంస్థ వారు కూడా ఈ మధ్య కాలంలో అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంస్థను స్థాపించిన కొత్తలో ఈ సంస్థ వారు కేవలం సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. వీరు నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలను సాధిస్తూ రావడంతో వీరు సినిమా నిర్మాణ రంగం తో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగం వైపు కూడా అడుగులు వేశారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా వీరు మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా అహో విక్రమార్క అనే సినిమా యొక్క ఏపీ మరియు తెలంగాణ థియేటర్ హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమాను ఈ సంస్థ వారు రేపు అనగా ఆగస్టు 30 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక నాని సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమాకు కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే అహో విక్రమార్క సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం చాలా కష్టం. అయినా కూడా మైత్రి సంస్థ వారు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో మైత్రి సంస్థ వారు ఎలాంటి రిజల్ట్ ను చూస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: