టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ చిన్నది ఇప్పుడు ఏ సినిమాలు చేస్తుందో తెలియడం లేదు. తెరపై ఆమె కనిపించి చాలా రోజులైంది. అయితేమాత్రం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యనే నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ జరగడంతో సమంత పేరు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా సమంత కూడా తన జీవితంలో జరుగుతున్న విషయాలను ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యనే తాను వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ చెన్నై ఫ్రాంజైనీ కొన్నట్లు సమంత ప్రకటించింది.

తన జీవితంలో ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం కొత్త ఆరంభమని సమంత ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా సమంత పికిల్ బాల్ గేమ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సమంత చాలా ఎనర్జిటిక్‌గా కనిపించడం చూసి సామ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇన్ ‌స్టాగ్రామ్‌లో సామ్ షేర్ చేసిన ఫోటోలను చూసి మురిసిపోతున్నారు. చిన్నతనం నుంచి తనకు ఆటలంటే చాలా ఇష్టమని, అందుకే తాను ఆ ఫ్రాంచైజీని కొన్నట్లు సమంత చెప్పుకొచ్చింది. స్కూల్ డేస్‌లో స్పోర్ట్స్‌పై ఎంతో ఇష్టం ఉండేదని, ఒకవేళ స్పోర్ట్స్‌పై దృష్టిపెడితే చదువును నిర్లక్ష్యం చేస్తుందేమోననే సందేహంతో తన పేరెంట్స్ ఆటలు ఆడనిచ్చేవారు కాదని సమంత సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత స్పోర్ట్స్ విలువ తనకు చాలా తెలుసొచ్చినట్లు చెప్పింది సమంత. అందర్నీ హెల్తీగా ఉంచడంతో పాటు ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగించేలా స్పోర్ట్స్ ధైర్యాన్నిస్తాయని సమంత తెలిపింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇకపోతే సినిమాల విషయానికి వస్తే మా ఇంటి బంగారం అనే మూవీని తన సొంత బ్యానర్లో సమంత నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా వివరాలను సామ్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే తాను కథలు వింటున్నానని, సరైన కథ దొరికితే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమంత చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: