తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటన సింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ వీరు నలుగురు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విజయాలను అందుకొని , ఇప్పటికీ విజయాలను అందుకుంటు తెలుగు పరిశ్రమలో తిరుగులేని హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా సాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే బాలకృష్ణ హీరోగా రూపొందిన చెన్నకేశవ రెడ్డి మూవీ రీ రిలీస్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.

అలాగే బాలకృష్ణ హీరోగా రూపొందిన బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి నరసింహ నాయుడు సినిమా కూడా మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర సినిమాని కూడా ఈ సంవత్సరం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో ఒకటి అయినటువంటి మాస్ మూవీ ని కూడా రీ రిలీజ్ చేశారు.

మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా ఈ ముగ్గురు హీరోలు ఇప్పటికే తాము నటించిన సినిమాలను రీ రిలీజ్ చేసి తమ అభిమానులను ఎంతో ఆనంద పెట్టారు. ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఏ సినిమా కూడా రీ రిలీజ్ కావడం లేదు. దానితో ఆయన అభిమానులు కూడా వెంకటేష్ నటించిన ఏదైనా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ని రీ రిలీస్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: