రెబల్ స్టార్ ప్రభాస్ , దిల్ రాజు బ్యానర్ లో మున్నా , మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ రెండు మూవీ లలో మున్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుగా , మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా దిల్ రాజు ఆ ఇంటర్వ్యూన్లో పాల్గొన్నారు. అందులో భాగంగా మున్నా సినిమా సమయంలో జరిగిన ఒక విషయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మున్న మూవీ ని తెరకెక్కించాం. సినిమా మొత్తం పూర్తి అయింది.

సినిమా పూర్తి అయిన తర్వాత ఆ మూవీ మంచి విజయం సాధిస్తుంది అని మేము అనుకున్నాం. ఇక సినిమా విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు నేను జనాలతో కలిసి థియేటర్లో ఆ సినిమా చూశాను. సినిమా చూసిన సమయంలోనే జనాల్లో ఆ సినిమాపై రియాక్షన్ తేడా కొట్టింది. నేను సినిమా యావరేజ్ విజయం అందుకుంటుంది అనే విషయాన్ని ప్రభాస్ కి చెబుదాము అని వాళ్ళ ఇంటికి వెళ్లాను. ఇక అప్పటికే ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది అనే ఉద్దేశంతో ఆయన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వెళ్లాను... నన్ను ఏంటి సార్ ఇలా వచ్చారు అని అన్నాడు. సినిమా యావరేజ్ అవుతుంది ఫిక్స్ కా అన్నాను.

ఏంటి సార్ బ్లాక్ బాస్టర్ అంటున్నారు అంతా అని ప్రభాస్ అన్నాడు. అదంతా తప్పు రిపోర్ట్. సినిమా యావరేజ్ అవుతుంది. అలా పిక్స్ అవ్వు. ఏదైనా పెద్ద మిరాకిల్ జరిగితే యబో అవేరేజ్ అవుతుంది. అంతకుమించి ఏమీ జరగదు అని చెప్పాను. ఇక సినిమా రిసల్ట్ అలానే వచ్చింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే మున్నా సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించగా ... ప్రకాష్ రాజు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: