నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన చిత్రం సరిపోదా శనివారం. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. గతేడాది దసరా చిత్రంతో రూ.100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టినాని, తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో అంతకుముందు అంటే సుందరానికి సినిమా చేశాడుకానీ అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.  నాని, ప్రియాంక మోహన్‌లతో వివేక్ ఆత్రేయ తీసిన  సరిపోదా శనివారం లో విలన్‌గా ఎస్ జే సూర్య నటించాడు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్‌లతో పోతారు.. మొత్తం పోతారు అంటూ

 హైప్ క్రియేట్ చేశారు. ఆగస్ట్ 29న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోలు కూడా పడ్డాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో మామూలుగా లేదు.. మామూలు హై కాదు.. పోతారు..మొత్తం పోతారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ కాకపోతే.. శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్‌తో ఉంది అని రివ్యూ లో ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు నుండే ఈ  సినిమా గురించి నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ఓ లుక్కే్స్తే.. సినిమాలో టైటిల్ రోల్‌లో నటించిన సూర్య వారానికి

 ఒక రోజు శనివారం మాత్రమే కోపంగా ఉంటానని తల్లికి వాగ్దానం చేస్తాడు. కేవలం శనివారం మాత్రం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాడు సూర్య. అతడు తన కోపాన్ని వదిలించుకోవడానికి శనివారాన్ని రోజుగా ఎంచుకున్నాడనేది సినిమాలో కనిపించే మిస్టీరియస్ ఎలిమెంట్. విలన్‌గా నటించిన ఎస్‌జే సూర్య పాత్ర పేరు ఇన్‌స్పెక్టర్ దయానంద్‌. మొత్తానికి ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి ఇటీవల హాయ్ నాన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: