నాచురల్ స్టార్ నాని దర్శకుడు వివేకా ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై  ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌లు , పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాని, ఎస్‌జే సూర్యల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. ఇది ఇలా ఉంటే దసరా, హాయ్ నాన్న వంటి

 సినిమాలకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సరిపోదా శనివారం మూవీ కూడా మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే రూ.42 వేల కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ అని చెప్పవచ్చు. మరి నాని ఈ టార్గెట్‌ను ఎలా కొడతాడా అనేది ట్రేడ్ వర్గాలను సైతం అటెన్షన్‌లో ఉంచింది. ఓవర్సీస్‌లో ప్రత్యేకించి అమెరికన్ మార్కెట్‌లో నాని సినిమాలు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో సరిపోదా శనివారం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ప్రీమియర్స్ కోసం 17 వేల టికెట్లు బుక్ అయినట్లుగా

 వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని 415 లోకేషన్స్‌లో ప్రీమియర్స్ పడగా. అడ్వాన్స్ బుకింగ్స్ కింద ఈ సినిమాకు 3,12,356 డాలర్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీనిని బట్టి నాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చని నాని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ట్రెండ్‌ను బట్టి చూస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6 నుంచి రూ.7 కోట్ల మధ్యలో షేర్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ లెక్కన సరిపోదా శనివారం రూ.8 నుంచి రూ.9 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్ షేర్‌ను రాబట్టవచ్చని అంచనా. మరి నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఎస్.జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: