టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. తను ఎంచుకొనే కథలతో మంచి విజయాలను కూడా అందుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్  సినిమాలతో ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ వరుసగా కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న శ్రీ విష్ణు ఇప్పుడు మరొక కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో శ్రీ విష్ణు నటించిన రాజ రాజ చోర సినిమా తీసిన డైరెక్టర్ హసిత్ గౌరీ దర్శకత్వంలో స్వాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.



ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా అంచనాలను పెంచేసాయి. ఇప్పుడు తాజాగా స్వాగ్ టీజర్ ని విడుదల చేయగా మరింత ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ చూస్తూ ఉంటే రాజుల కాలం, ప్రస్తుతం, భవిష్యత్తు కాలానికి సంబంధించిన సినిమాల కనిపిస్తోంది. ఇలా ఒకే చిత్రంలో మూడు కాలాలకు సంబంధించినదిగా చూపించబోతున్నారు. ముఖ్యంగా మగ ,ఆడ గొప్ప అనే రెండు అంశాల మధ్య జరిగేటటువంటి యుద్ధంలా టీజర్ లో చూపించడం జరిగింది. ఈ కాన్సెప్టులో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.


ప్రస్తుతమైతే స్వాగ్ టీజర్ ట్రెండీగా మారిపోయింది. ఇందులో హీరోయిన్గా రీతూ వర్మ నటించిన ముఖ్యమైన పాత్రలో మీరాజాస్మిన్ కూడా నటించింది. అలాగే ఈ చిత్రంలో శ్రీ విష్ణు నాలుగు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. అటు శ్రీ విష్ణు హీరోయిన్ రీతు వర్మ ఇద్దరు కూడా సినిమాలో కాలానికి తగ్గట్టుగా పాత్రలు వేసి ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి శ్రీ విష్ణు మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. మరి టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్వాగ్ సినిమాతో సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ విజయాన్ని శ్రీ విష్ణు అందుకు ఉంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: