ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఇండైరెక్ట్‌గా పుష్ప చిత్రంపై కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. "ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు నటించేవారు కానీ ఇప్పుడు అడవుల్ని నరికేసి, స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లలో నటిస్తున్నారు" అంటూ పవన్ అన్నారు. ఈ కామెంట్లతో అల్లు Vs మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో సోషల్ మీడియాలో కొట్టుకున్నారో అందరూ చూశాం. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కామెంట్లపై పుష్ప నిర్మాత రియాక్ట్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్‌ సంస్థ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్‌ తాజాగా 'మత్తు వదలరా 2' టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్- పుష్ప కామెంట్లపై మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు."కళ్యాణ్ గారు ఆ సందర్భంలో మాట్లాడారు కానీ మనమే ఆ కామెంట్లను దీనికని దానికని అనుకుంటున్నాం. అసలు ఆయన స్థాయి వేరండి. ఆయన వచ్చిన సినిమా బ్యాక్ గ్రౌండ్‌ను ఆయనే తక్కువ చేయాలని ఎప్పుడు అనుకోరు. అదేదో ఫ్లోలో అలా వచ్చింది. దీన్ని దానికని మనం అంటించుకుంటున్నాం. అందుకే ఆయన అలా అన్నారు అనుకుంటున్నాం. కానీ ఆయన అన్నది పుష్ప గురించి కాదు." అంటూ రవి శంకర్ అన్నారు. ఇక పుష్ప 2 రిలీజ్ మళ్లీ వాయిదా పడతుందని వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు. సినిమా డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని ఒక రోజు ముందు పక్కా ప్రీమియర్స్‌ ఉంటాయన్నారు. "పుష్ప 2ను ఈ డిసెంబర్‌ 6న విడుదల చేస్తున్నాం. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. రిలీజ్‌పై ఎన్నో రుమార్లు వస్తున్నాయి.. అవన్నీ మేమూ చూస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా డిసెంబర్‌ 6నే సినిమా రిలీజ్‌ చేస్తాం. షూటింగ్‌ కూడా సాఫీగా సాగుతుంది. ఈ సెప్టెంబర్‌ 2న ఫస్టాఫ్‌ ఎడిటింగ్‌కి ఇచ్చేస్తున్నారు. అది జరుగుతుండగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతుంది. ఇక సెకండాఫ్‌ కూడా అక్టోబర్‌ 6 తేదికల్లా ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా పూర్తి చేసి కంఫర్టబుల్‌గా నవంబర్‌ 28 వరకు ఫైనల్ కాపీ ఇచ్చేసి వరల్డ్‌ వైడ్‌గా పంపించాలని ప్లాన్‌ చేస్తున్నాం. నవంబర్‌ 25న సెన్సార్‌ బోర్డుకి కూడా ఇచ్చేస్తాం" అంటూ రవి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: