టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్.. నటుడు నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ త్రివిక్రమ్ కు క్షమాపణలు చెప్పడం జరిగింది.. దీంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలకు ఇప్పుడు చెక్ పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఒక అభిమాని ఫోన్ చేస్తే .. నోరు జారి నానా మాటలు అన్నారు. సెప్టెంబర్ -2 వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.


ఈవెంట్ లో ఒక రిపోర్టర్.. గబ్బర్ సింగ్ అవకాశం ఎలా వచ్చిందో అడగగా.. అది చెబుతూ త్రివిక్రమ్ కు ముందుగా క్షమాపణలు చెబుతూ గబ్బర్ సింగ్ సినిమా మూవీ తనకు రావడానికి ముఖ్య కారణం త్రివిక్రమే అంటూ తెలియజేశారు.. పవన్ త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తనకు తన జీవితాన్ని మార్చేశారని బండ్ల గణేష్ తెలియజేశారు. భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ కు సంబంధించి ఒక ఆడియో సంచలనంగా మారింది.


ముఖ్యంగా ఆ ఆడియోలో త్రివిక్రమే తనని ఈవెంట్ కు రానివ్వకుండా అడ్డం పడుతున్నారని అభిమానులు కోరుకుంటే మాత్రం ఎలాగోలాగా అక్కడికి వస్తాను అంటూ బండ్ల గణేష్ చేసిన ఒక ఆడియో వైరల్ గా మారింది.. అయితే మొదట ఈ వాక్యాలు తాను అనలేదని చెప్పినప్పటికీ ఆ తర్వాత తప్పు ఒప్పుకొని మరి క్షమాపణలు తెలియజేశారు బండ్ల గణేష్.. అలాగే తీన్మార్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నాను కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు చేయడం వల్ల మిస్ అయిపోయాము అంటూ తెలియజేశారు. కానీ ఇటీవలే సినిమా చూసినప్పుడు కూడా ఈ సినిమా ఎందుకు ఆడలేదనేది తనకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందని తెలిపారు. ఈ చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్ చేస్తానని కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: