తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించాడు. ఇకపోతే బాలకృష్ణ , బి.గోపాల్ దర్శకత్వంలో ఐదు సినిమాలలో హీరోగా నటించాడు. అందులో రెండు మూవీలు భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , మరో రెండు సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాయి. వీరి కాంబోలో రూపొందిన ఒకే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అందుకుంది. మరి వీరి కాంబోలో రూపొందిన సినిమాలు ఏవి ..? అవి ఏ స్థాయి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ బి.గోపాల్ కాంబినేషన్లో మొదటగా లారీ డ్రైవర్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 1990వ సంవత్సరం విడుదల అయింది.

సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా రూపొందింది. ఈ మూవీలో బాలయ్యకు జోడిగా విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా 1992 వ సంవత్సరం విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో సమరసింహారెడ్డి అనే సినిమా రూపొందింది. ఈ మూవీలో సిమ్రాన్ , అంజలి జావేరి బాలయ్యకు జోడిగా నటించారు. 1999 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో నరసింహ నాయుడు మూవీ రూపొందింది. సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. 2001 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో పలనాటి బ్రహ్మనాయుడు అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇలా బాలయ్య , బి గోపాల్ కాంబోలో రూపొందిన సినిమాలలో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలు భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు మూవీలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. పలనాటి బ్రహ్మనాయుడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: