టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అలనాటి నటి టబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టబు ఇండస్ట్రీలో రెండు మూడు దశాబ్దాలుగా తన హవాను కొనసాగించింది. హైదరాబాద్ కు చెందిన టబు అతి చిన్న వయసులోనే బాలీవుడ్ లో బాలనాటిగా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హీరోయిన్గా పరిచయమైంది.


అలా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసిన తర్వాత కూలి నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగులో ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయింది. పాండురంగడు సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్ పరిశ్రమకు దూరమైంది.


ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తల్లి పాత్రలో చాలా డీసెంట్ రోల్ చేసింది. ఆ తర్వాత మళ్లీ మరో సినిమాను ఓకే చేయలేదు. అయితే టబు 52 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఏమాత్రం తరగని అందంతో ఫిట్ గా ఉంది. టబ ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది.

తాను హీరోయిన్గా చేసిన సమయంలో కొంతమంది హీరోలతో ఎఫైర్లు నడిపినట్లు అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. అందులో సంజయ్ కపూర్, సాజిద్ నడియావాలా, అజయ్ దేవ్ గన్, మనోజ్ బాజ్ పాయ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎఫైర్లు నడిపించిందని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఇంతమందితో ఎఫైర్స్ నడిపించినప్పటికీ టబు ఎవరిని వివాహం చేసుకోలేదు. కానీ ఆ హీరోలు మాత్రం వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. టబు మాత్రం వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: